ఈ క్రమంలో సదరు విద్యార్థి ఎస్సీ అని చెప్పగా ఎస్సీ అంటే మాల లేక మాదిగ అని అడిగాడు..వర్ల రామయ్య. దీంతో ఆ విద్యార్థి మాదిగా అని చెపితే.. నువ్వేమి చదువుతావు పక్కనే పట్టించుకోవటంలేదు వెదవా కనీసం పరిక్షలు కూడా రాసి ఉండవు. ఇంత చిన్న వయస్సులో సెల్ ఫోన్ ఎందుకు రా..? మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? పొలం ఉందా? బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంది? డబ్బుల్లేకపోతే ఎలా చదువుకుంటావ్.. ఫోన్లవి పక్కనపెట్టి చదువుకో’ అంటూ విద్యార్ధికి హితవు పలికాడు. దీంతో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి రావెల కిషోర్ బాబు ఫైర్ అయ్యారు.
మాదిగ విద్యార్థి పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను ఖండించారు...ఆయన చేసిన కామెంట్స్ వల్ల మాదిగ జాతి మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వర్ల రామయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మాదిగ జాతి ఉద్యమం చేస్తుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా తన నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు జోక్యం చేసుకుంటున్నారని..అసలున్నావా నియోజకవర్గంలో వాళ్ళకు పని ఏమిటని ప్రశ్నించారు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు. అయితే రావెల కిషోర్ ఇన్ని కామెంట్ చేసిన చంద్రబాబు స్పందించకపోవడంతో రావెల పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది!