ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ మూడు రోజుల యాత్ర నిమిత్తం తిరుమలలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ నేప్యథ్యంలో ఆయన నిన్న కాలినడకన తిరుమలేశుడిని దర్శడించుకున్నారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
Image result for pawan kalyan tirumala
ఈ ఉదయం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను బస్సు యాత్ర చేపట్టినట్టు పవన్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర స్థాయిలో నడుస్తుందని..ప్రజలకు కేంద్రం చేసిన మోసం అధికార పార్టీకి ఇప్పుడు గుర్తు రావడం వింటానికే విడ్డూరంగా ఉందని..వారు చేస్తున్న దొంగ పోరాటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని..ఇక పవన్ కళ్యాన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం చాలా సంతోషకరమైన విషయమే అని అన్నారు.
Image result for pawan kalyan tirumala
నాయకుడు అన్న వారు ప్రజల కష్టసుఖాలు అర్ధం చేసుకని  వారి కోసం పోరాడే వారు..అలాంటి వారినే ప్రజలు గుర్తు పెట్టుకుంటారని ఆయన అన్నారు. సమస్యలపై కదిలిన పవన్ ను అభినందించాల్సిందేనని, సమస్యలకు పరిష్కారం లభిస్తే ఇంకా ఆనందమని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ బస్సు యాత్ర చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమై శ్రీకాకుళం వరకూ సాగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: