- సభలో బలనిరూపణ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని గవర్నర్ ని కోరిన యడ్యూరప్ప
- ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కావాలని కోరిన కుమార స్వామి
- కర్ణాటక ఎలక్షన్ ఫైనల్ రిజల్ట్: కాంగ్రెస్-78, భాజపా-104, జేడీఎస్-38, ఇతరులు-2 స్థానాల్లో విజయం
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గవర్నర్ కలిశారు
- కాంగ్రెస్ మద్దతు స్వీకరిస్తున్నాం. ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం- కుమారస్వామి- ప్రజల ఆశీర్వాదంలో భాజాపా అతి పెద్ద పార్టీగా అవతరించింది : యడ్యూరప్ప
- కర్ణాటక ప్రజలు మార్పు కోరుతు..తీర్పు ఇచ్చారు : యడ్యూరప్ప.
- బెంగుళూరు : దేవేగౌడ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత సీకే జాఫర్ షరీఫ్
- బెంగుళూరు : పద్మనాభనగర్ లోని దేవేగౌడ నివాసానికి చేరుకున్న కుమార్ స్వామి. దేవేగౌడ నివాసానికి భారీగా చేరుకుంటున్న జేడీఎస్ కార్యకర్తలు
- సాయంత్రం గవర్నర్ ను కలవనున్న జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్న జేడీఎస్, కాంగ్రెస్.
- జేడీఎస్ కి మద్దతు ఇవ్వడంతో కర్ణాటక రాజకీయంలో కొత్త మార్పు.
- అతిపెద్ద పార్టీ గా అవతరించినా..సాధారణ మెజార్టీ అందుకోలేక పోయిన బీజేపీ
- సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం- యడ్యూరప్ప
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ను కోరనున్న జేడీఎస్, కాంగ్రెస్!
- జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది: సిద్దరామయ్య
- దిల్లీ రావాల్సిందిగా యడ్యూరప్పకు భాజపా అధిష్ఠానం ఆదేశం
- ఈ రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం
- దేవెగౌడ, కుమారస్వామితో గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ మంతనాలు
- కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం, భాజాపాకు అధికారం దక్కకుండా కాంగ్రెస్ ఎత్తులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ కి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్దమైనట్లు సమాచారం.
- బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ నేతల సమావేశం..!
- బెంగళూరు గాంధీనగర్లో దినేష్ గుండూరావు(కాంగ్రెస్) విజయం
- తమకూరు జిల్లా కొరటగెరెలో కేవీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర విజయం
- కాంగ్రెస్ 75, బీజేపీ 105, జేడీఎస్ 40, ఇతరులు 2 సీట్లలో ఆధిక్యం
- క్షణక్షణానికి మారుతున్న ఆధిక్యాలు.. మెజారిటీ ఫిగర్కు ఇంకా దూరంగానే బీజేపీ
- సాధారణ మెజారిటీ రాకపోవడంతో జేడీఎస్ మద్దతు తీసుకోకతప్పని పరిస్థితి..
- బీజేపీ జేడీఎస్ మద్దతు తీసుకుంటుందా? లేక పార్టీలను చీల్చుతుందా?
-చాముండేశ్వరిలో సిద్ధరామయ్య ఓటమి. సిద్ధరామయ్యపై జేడీఎస్ అభ్యర్థి జి.టి.దేవెగౌడ విజయం
-బెంగళూరు బీటీఎం లేఅవుట్లో రామలింగారెడ్డి(కాంగ్రెస్)విజయం
-కర్ణాటక: సొరబలో కుమార్ బంగారప్ప(భాజపా)విజయం. సోదరుడు మధు బంగారప్ప(కాంగ్రెస్)పై కుమార బంగారప్ప జయకేతనం
-రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి(జేడీఎస్) విజయం
-హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్లో జగదీశ్ శెట్టర్(భాజపా)విజయం
- కర్ణాటక: సిరుగుప్పలో భాజపా అభ్యర్థి సోమలింగప్ప విజయం
- కర్ణాటక: కంప్లిలో సురేశ్బాబు(భాజపా)విజయం
-కర్ణాటక: బెంగళూరు శివాజీ నగర్లో రోషన్ బేగ్(కాంగ్రెస్) గెలుపు
- కర్ణాటక: శివమొగ్గలో ఈశ్వరప్ప(భాజపా)విజయం
- షికారిపురలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప విజయం
- మైసూరు మినహా మిగతా ప్రాంతాల్లో బీజేపీ హవా
- సాధారణ మెజార్టీ దిశగా బీజేపీ పరుగులు
- తీర్థహళ్లిలో అరగ జ్ఞానేంద్ర (బీజేపీ) గెలుపు
- మడబిద్రిలో ఉమనాథ విజయం
- రామనగరలో 7వేల ఓట్లతో కుమారస్వామి ఆధిక్యం
- చెన్నపట్నలోనూ ముందంజ
- హైదరాబాద్ కర్ణాటక, ముంబై కర్ణాటకలో బీజేపీ ముందంజ
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి దూసుకెళుతున్న జేడీఎస్
- దక్షిణ కర్ణాటకలో కాంగ్రెస్ను దెబ్బకొట్టిన జేడీఎస్
- కర్ణాటక: బెంగళూరు శివాజీ నగర్లో రోషన్ బేగ్(కాంగ్రెస్) గెలుపు
-కర్ణాటక: శివమొగ్గలో ఈశ్వరప్ప(భాజపా)విజయం
-దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6గంటలకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించనున్నారు
-ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. ప్రధాని మోదీపై నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు భాజపాను గెలిపించారు- రవిశంకర్ ప్రసాద్
-మొళకాల్మూర్లో శ్రీరాములు(భాజపా)విజయం
- బాగేపల్లిలో సినీ నటుడు సాయికుమార్(భాజపా)పరాజయం
- కర్ణాటక రిజల్ట్@12.00: కాంగ్రెస్-66, భాజపా-96, జేడీఎస్-36, ఇతరులు-2 ఆధిక్యం(భాజపా 14, కాంగ్రెస్ 6, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం)
- కర్ణాటకలో భాజపాకు ఇది అతిపెద్ద విజయం. కన్నడ ప్రజలు సుపరిపాలన కోరుకున్నారు - ప్రకాశ్ జావడేకర్
- జేడీఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి- కర్ణాటక ఎన్నికల ఫలితాలపై పశ్చిమ్బంగా సీఎం మమత బెనర్జీ
- అభివృద్ధికి ఓటు వేసిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు- నిర్మలా సీతారామన్
- ప్రధాని మోదీపై నమ్మకంతోనే కర్ణాటక ప్రజలు భాజపాను గెలిపించారు.
- కర్ణాటకలోని తెలుగు ఓటర్లు భాజపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు: 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయాన్ని ఆపడం ఎవరితరం కాదు:కృష్ణంరాజు
- కర్ణాటక రిజల్ట్@11.30: కాంగ్రెస్-65, భాజపా-105, జేడీఎస్-38, ఇతరులు-4 ఆధిక్యం(భాజపా ఏడు, కాంగ్రెస్ రెండు, జేడీఎస్ ఒక స్థానంలో విజయం)
- షికారిపురలో యడ్యూరప్ప విజయం
- కోలార్లో బీఎస్పీ అభ్యర్థి శ్రీనివాసగౌడ గెలుపు
- మంగళూరులో యు.టి.అబ్దుల్ ఖాదర్(కాంగ్రెస్) విజయం
- చిత్రదుర్గ జిల్లా హొళల్కెరెలో మంత్రి ఆంజనేయులుపై భాజపా అభ్యర్థి చంద్రప్ప విజయం
- కర్ణాటక రిజల్ట్@11.00: కాంగ్రెస్-64, భాజపా-111, జేడీఎస్-44, ఇతరులు-2 ఆధిక్యం(భాజపా నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ ఒకస్థానంలో విజయం)
- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బాదామిలో శ్రీరాములుపై 3వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా, చాముండేశ్వరిలో 12వేలకు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
- ప్రాంతీయ సెక్యులర్ పార్టీలను నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. కాంగ్రెస్ అంచనాలు తప్పడం వల్లే నేడు భాజపా దేశాన్ని పాలిస్తోంది. -దనిష్ అలీ(జేడీఎస్ నేత)
- చిత్రదుర్గ జిల్లా చళ్లకెరెలో రఘుమూర్తి(కాంగ్రెస్)విజయం
- జయాపజయాలపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. 11.30గంటల వరకూ వేచి చూడండి. -కార్యకర్తలను ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ
- కుందాపురలో హాలాడి శ్రీనివాసశెట్టి(భాజపా)విజయం
- ఉడుపి జిల్లా కాపు నియోజకవర్గంలో లాలాజీ ఆర్.మెండన్(భాజపా)విజయం
- కర్ణాటక రిజల్ట్@10.30: కాంగ్రెస్-65, భాజపా-110, జేడీఎస్-42, ఇతరులు-1 ఆధిక్యం(భాజపా నాలుగు స్థానాల్లో విజయం)
- కర్ణాటక: బెంగళూరులోని భాజపా పార్టీ కార్యాలయం ఎదుట భాజపా కార్యకర్తల సంబరాలు
- మధ్యాహ్నం 1గంట తర్వాత దిల్లీలోని పార్టీ ఆఫీస్కు వెళ్లనున్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా
- రామనగర నియోజకవర్గంలో 1552 ఓట్లతో కుమారస్వామి ముందంజ
- బళ్లారి సిటీలో బీజేపీ అభ్యర్థి గాలి సోమశేఖరరెడ్డి ఆధిక్యత
- హడగళి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర నాయక్ ఆధిక్యం
- బళ్లారి బెల్ట్ లో గాలి జనార్దనరెడ్డి సోదరుల హవా
- శికారిపురలో యడ్యూరప్ప ముందంజ
- శృంగేరిలో కాంగ్రెస్ కు ఆధిక్యం!
- లింగాయత్ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం
- హరప్పనహళిలో గాలి కరుణాకరరెడ్డి ముందంజ
- ఆధిక్యంలో హెచ్డీ రేవణ్ణ (జేడీఎస్)
- కనకపురలో శివకుమార్ (కాంగ్రెస్) ముందంజ
- బాదామిలో ఆధిక్యంలోకి వచ్చిన సిద్దరామయ్య
- చాముండేశ్వరిలో 6వేల ఓట్లతో వెనుకబడిన సీఎం సిద్దరామయ్య
- చిత్తాపూర్లో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే ముందంజ
- రెండు స్థానాల్లోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ..
- చాముండేశ్వరిలోనూ సీఎం సిద్దరామయ్య వెనుకంజ
- బాదామిలో సీఎం సిద్దరామయ్య వెనుకంజ..
- బాదామిలో సీఎం సిద్దరామయ్యపై బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ముందంజ
- వరుణలో సీఎం తనయుడు యతీంద్ర ముందంజ
- చిక్మగ్లూరులో సీపీ రవి (బీజేపీ) ముందంజ
- బళ్లారిలో గాలిసోమశేఖరరెడ్డి (బీజేపీ) ముందంజ
- రామనగరిలో కుమారస్వామి ముందంజ
- కర్ణాటక: రామనగరలో కుమారస్వామి(జేడీఎస్)ఆధిక్యం
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాగమంగళలోని ఆదిచుంచనగిరి మహా సంస్థాన మఠంలో జేడీఎస్ అధినేత కుమారస్వామి పూజలు
- కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద యజ్ఞం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (కాంగ్రెస్) చాముండేశ్వరి, బాదామి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్) చెన్నపట్టణ, రామనగర, లోక్సభ సభ్యుడు శ్రీరాములు(భాజపా) మొలకాల్మూరు, బాదామి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాలపై రాష్ట్రమంతా ఆసక్తి చూపింది. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప తలపడిన శికారిపురలో ఆయన గెలుపు నల్లేరుపై బండి నడకేననే అంచనాలు ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల్లో విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 222 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
- బెంగళూరులోని బీఎంఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ వద్ద దృశ్యాలు. ఫలితాల నేపథ్యంలో 50వేలమంది పోలీసులతో కర్ణాటక అంతటా కట్టుదిట్టమైన భద్రత.
- ఒకవైపు ఉండేలా ట్రెండ్ మొదలైంది. ఏదో ఒక పార్టీ గెలిస్తే ఓకే గాని హంగ్ వస్తే కర్ణాటకలో రాజకీయ కల్లోలం ఇపుడపుడే చల్లారేలా లేదు. ఎందుకంటే ఒకపుడు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి హంగ్ వస్తే మంత్రి పదవులతో సరిపెట్టుకునే పరిస్థితి లేదు.
- ఈ నెల 12న జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత నడుమ 40 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.