రాజకీయాలతో పెట్టుకోవడమంటే.. మాటలు కాదు. అదృష్టం, ప్రజల మద్దతు కూడా లభించాలి. ఈ రెంటిలో ఏది లోపించినా కష్టమే. ఇక, ఇవన్నీ అలవాటైపోయిన నాయకులకు ఏ మంత కష్టం కాదు. కానీ, ముక్కుసూటిగా ఉండే ప్రకాష్ రాజ్ లాంటి నాయకుడి మాటేమిటి? ఆయన ఏదైనా పిలిపిస్తే.. అది అమలు కాకపోతే.. సర్దుకు పోతాడా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలే సోషల్ మీడియాలో ఎదురవుతున్నాయి. ప్రకాష్ రాజ్ను టార్గెట్ చేస్తూ.. నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. తాజాగా కర్ణాటక రిజల్ట్్స వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా 104 సీట్లతో బీజేపీ తన హవా ప్రదర్శించింది.
అధికారం చేపట్టేందుకు కేవలం 10 సీట్ల తేడాలోనే ఆగిపోయింది. అయితే,దీనికి ముందు ఎన్నికల ప్రచారంలో నటుడు ప్రకాష్ రాజ్.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ.. ప్రకాష్ రాజ్ అనేక సదస్సుల్లో మాట్లాడాడు. ట్విట్టర్ వేదికగా ఆయన చెలరేగిపోయాడు. ఎలాంటి రాజకీయ పార్టీ అండ లేకుండానే తనకు తానే కర్ణాటక మొత్తం సొంత ఆసక్తితో పర్యటించారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో సోషల్ మీడియాలో సంచలనాల మీద సంచలనాలు సృష్టించారు. తనసూటి ప్రశ్నలతో కమలనాథులకు కడుపు మండేలా చేశారు. ప్రకాశ్ రాజ్ చేస్తున్న డ్యామేజ్ తో కర్ణాటక ఎన్నికల్లో తమకు ఎంతోకొంత నష్టం వాటిల్లుతుందని కమలనాథులు భావించారు.
ప్రధానంగా పార్టీని అధికారంలోకి తేవాలని భావించిన సమయంలో ఒక పక్క ఏపీ సీఎం చంద్రబాబు, మరోపక్క ప్రకాష్ రాజ్లు చేస్తున్న డ్యామేజీ అంతా ఇంతా కాదని బీజేపీ అధిష్టానం చింతించింది. అయితే.. అందుకు భిన్నంగా బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు. అధికారం చేపట్టే మేజిక్ ఫిగర్ కు కాస్త తక్కువగా భారీ మెజారిటీని అందించారు. దీంతో ప్రకాశ్ రాజ్ ప్రభావం ఏమీ లేదని తలిపోంది. కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెప్పకు న్నా.. బీజేపీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దు అంటూ కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న మాటను పరోక్షంగా చెప్పారు.
అయినప్పటికీ ఆయన మాటల్ని ఓటర్లు పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి. సొంత రాష్ట్రంలో సొంత ప్రజల్ని ప్రకాశ్ రాజ్ ప్రభావితం చేయలేకపోయాడనే కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రకాశ్ రాజ్ నోటి వెంట మాట రాకుండా పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా ప్రజల మూడ్ను పసిగట్టడంలో ప్రకాష్ రాజ్ అత్యుత్సాహానికి పోయాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.