ఈ క్రమంలో ముందుగా ప్రజలలో సానుభూతి సంపాదించుకోవడానికి తెలుగుదేశం నాయకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు..తాజాగా ఇటీవల కొందరు టిడిపి నేతలు కర్ణాటక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పై భారతీయ జనతా పార్టీ కేసులు బనయిస్తుందని పేర్కొనడం జరిగింది. దీంతో ఆరోపణల మీద ఏపీ బీజేపీ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.
లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిపై కేంద్రమే నేరుగా కేసులు పెట్టె వీలుంటుందా ..?.ఇప్పటిదాకా ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా ..అయిన తప్పులు చేయనప్పుడు ఎందుకు భయపడాలి ..ఎందుకు ఇలా తమపై బురద చల్లుతున్నారు.
ఒకవేళ కేసులు పెడితే న్యాయంగా తాము నిర్దోషులమని నిరూపించుకోవాలి కదా అని ఆయన అన్నారు .. కేసులు నిజమని తేలితే బాబు జైలు మెట్లు ఎక్కడం ఖాయమని అన్నారు ..అయినా సరే భారతదేశంలో చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని పేర్కొన్నారు. కర్ణాటక ఎలెక్షన్ హడావిడి అయిపోయాక ఈ విషయం అందరికీ బోధపడుతుందని తెలిపారు.