రాజకీయాల్లో తనదైన మార్క్ చాటిన సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం బీహార్ మాజీ సీఎం ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యా రాయ్ గత శనివారం జరిగింది. గత వారాంతంలో తాను వివాహమాడిన ఐశ్వర్యా రాయ్ ని తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ ఎక్కించి తిప్పారు. తాజాగా దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
12వ తేదీ శనివారం వీరి వివాహం పట్నాలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లికి తాత్కాలిక బెయిల్ పై లాలూ ప్రసాద్ యాదవ్ రాగా, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతి తదితరులు ఎంతో ఆనందంగా నృత్యాలు చేస్తూ వివాహ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
కొత్తగా పెళ్లైన జంట ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు కనిపిస్తుంది..తాజాగా తన ఇంట్లో సైకిల్ ఎక్కి, కొత్త భార్యను ముందు కూర్చోబెట్టుకున్న తేజ్ ప్రతాప్ యాదవ్ సైకిల్ ఎక్కించుకొని చుట్టూ తిప్పాడు. అయితే ఈ ఫోటో స్వయంగా తేజ్ ప్రతాప్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పంచుకున్నారు.