జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నారు . ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆడపిల్లల పై జరుగుతున్న అత్యాచారాల గురించి అఘాయిత్యాలు గురించి సంచలన కామెంట్ చేశారు. ఇటీవల గుంటూరు జిల్లాలో దాచేపల్లి గ్రామంలో చిన్న బిడ్డపై వృద్దుడు చేసిన పైశాచిక పని మరువకముందే అదే జిల్లాలో మరో ఆడపిల్ల పై అత్యాచారం జరగడం నిజంగా గుండెను కలిచివేసింది అన్నారు. ఇంత దారుణంగా హేయంగా సమాజంలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించాడు.
Image may contain: 5 people, people sitting
మరోపక్క మీడియా ముందు మైకులు ముందుకు వస్తే ఆడపిల్లల మీద అత్యాచారం జరిగితే ఊరుకోనంటూ ప్రకటనలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ...కళ్ళముందు అన్యాయం జరుగుతుంటే చర్యలు ఏవి అంటూ తీవ్రంగా స్పందించారు.
Image may contain: 10 people, people sitting
దీన్నిబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడపిల్లపై అఘాయితలకు తెగబడితే ఊరుకునేది లేదని చేస్తున్న వ్యాఖ్యలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, ఇటువంటి దాడులు చేసిన వారికి శిక్షలు విధించే ఫోక్సో చట్టము ఉన్నప్పటికీ ఇవి ఆగడం లేదంటే ఆ చట్టాన్ని మరింత కఠినతరంగా అమలు చేయాలని ఆయన అన్నారు.
Image may contain: 12 people, people smiling, crowd
అధికారంలో ఉండి సమాజంలో మహిళలను చిన్నపిల్లలను కాపాడు లేకపోతే ఎందుకు అక్కడ కూర్చోవటం అంటూ వ్యంగ్యంగా చంద్రబాబు పై సెటైర్లు వేశారు. అంతేకాకుండా దేశంలో..రాష్ట్రంలోగాని ఏ ఆడపిల్ల పైన అఘాయిత్యాలు..అత్యాచారాలకు గాని పాల్పడితే సదరు నిందితుడిని బహిరంగంగా సమాజంలో పెట్టి శిక్షపడేలా చూడాలని అటువంటి కొత్త చట్టాలు రావాలని కోరుకున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాష్ట్రంలో మిగిలి ఉన్న మహిళలను ఆడపిల్లలను కాపాడాలని ప్రాధేయపడ్డారు పవన్ కళ్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: