గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌​ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి వైఎస్‌ జగన్‌ ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
Image result for మద్దాల సునీత
ఆమెతోపాటు  వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. గతంలో దివంగత ముఖ్య‌మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హ‌యాంలో ఆమె ఎమ్మెల్యేగా ప‌నిచేశారు.  అదే విధంగా జంగ‌రెడ్డి గూడెంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత పిపిఎన్ చంద్ర‌రావు కూడా గురువారం వైసిపిలో చేరారు. చంద్ర‌రావు గ‌తంలో అగ్రిక‌ల్చ‌ర్ మార్కెటింగ్ క‌మిటికి  వైస్ చైర్మ‌న్ గా ప‌నిచేశారు.
Image result for మద్దాల సునీత
ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ గొల్ల‌గూడెంలో చంద్ర‌రావును ఆహ్వానించి కండువా క‌ప్పారు. త‌ర్వాత చంద్ర‌రావు మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర పూర్వ‌య్యే స‌మ‌యానికి జిల్లాలో టిడిపి ఖాళీ అయిపోతుంద‌ని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: