ఆంధ్రప్రదేశ్ లో ప్రతిసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే జేసి దివాకర్ రెడ్డి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.  ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ మూడు పార్టీలే మళ్లీ అధికారంలోకి వస్తాయంటూ వ్యాఖ్యలు చేశారు.  ఈరోజు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 105వ జయంతి సందర్భంగా అనంతపురంలోఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Image result for karnataka elections
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. 
Image result for karnataka assembly
కాగా, కర్ణాటకలో ఎవరెన్ని మాట్లాడినా..చివరికి బల నిరూపణ చేసిన వారికే ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందని..ప్రస్తుతం ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: