మరోపక్క ఇదే క్రమంలో వైసిపి అధినేత ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. దీంతో చాలామంది రాజకీయ నాయకులు...మాజీలు వైసీపీలోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికలు ఇంకా దగ్గరకు చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ తెలుగుదేశం నాయకులు కూడా తమ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కోసం...అలాగే వారి భవిష్యత్తు కోసం వైసీపీలోకి రావడానికి తెగ ఉబలాట పడుతున్నారు.
తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ చేస్తున్న పాదయాత్రలో వైయస్ జగన్ ని కలిసి పార్టీ కండువాను కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్..సదరు నాయకుడిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇంకా చాలామంది అనంతపురం జిల్లాకు చెందిన కోగటం విజయ్ భాస్కర్ రెడ్డి అనుచరులు వైసీపీలో చేరారు...తాజా పరిణామంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కి మతిపోయింది.