కర్ణాటక రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. చంద్రబాబు చేసిన ట్వీట్ లకు నెటిజన్లు చాలా దారుణంగా స్పందిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల విషయంలో  బీజేపీ నేత యాడ్యూరప్ప పైన చంద్రబాబు ట్వీట్ చేయడం జరిగింది.
Image result for chandrababu
యెడ్డీ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని.. ఆయన రాజీనామాతో అందరూ సంతోషంగా ఉన్నారని బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు చంద్రబాబు చేసిన ట్వీట్లపై వెటకారం చేశారు. ప్రజాస్వామ్యం రాజ్యాంగం అని పెద్దపెద్ద పదాలు మాట్లాడవద్దు చంద్రబాబు గారు అంటూ ఒకరు వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు.
Related image
మరొకరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను రాజీనామా చే పించకుండా మంత్రిపదవులు ఇచ్చిన దేశంలో ఏకైక ముఖ్యమంత్రి మీరే అంటూ ఎద్దేవా చేశారు. మరొక నెటిజన్ మామను వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను హోటల్లో బంధించినప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోయిందని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
Image result for chandrababu
ఇంకొకరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే చంద్రబాబు ఆనాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి వస్తున్న ప్రత్యేక హోదా ఎందుకు వద్దు అని అన్నారు అని ప్రశ్నించాడు. మొత్తంమీద కర్ణాటక ఎన్నికలపై చంద్రబాబు చేసిన ట్వీట్ లకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి భయంకరంగా రిప్లై లు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: