ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆంధప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ అయిన పోలవరం కట్టి తీరుతామని అన్నారు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కావొస్తున్న కేంద్రం ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చలేదని ఇప్పటికీ మాయ మాటలు చెబుతూనే ఉన్నారని అన్నారు. అనంతపురం జిల్లా తురకలాపట్నంలో ఈ రోజు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... ఏపీని ఆదుకుంటామని తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ చెప్పారని, రాష్ట్రానికి కాంగ్రెస్‌ మోసం చేసిందని తాము న్యాయం చేస్తామని అన్నారని పేర్కొన్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం..కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే..రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశపడ్డామే కానీ..ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పడంతో కేంద్రం రంగు బయట పడిందని అన్నారు.  అందుకే తాము ఏపి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని అన్నారు.   తనపై నమ్మకంతో నన్ను ప్రజలు గెలిపించారని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ 29 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఏపీ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
Image result for polavaram project
తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత  రాష్ట్రంలో  రైతులకు అప్పుల నుంచి విముక్తి కలిగించామని, అనంతపురం జిల్లాలోనే సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.10 వేల కోట్లు వినియోగించామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.53 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, నెలకు రూ.1000 చొప్పున పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని అన్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.    



మరింత సమాచారం తెలుసుకోండి: