రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన...టిడిపి బిజెపి పార్టీలు..ప్రస్తుతం కొన్ని రాజకీయ కారణాల రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రితిలో వాతావరణం నెలకొంది. రెండు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా చంద్రబాబపై తీవ్రమైన ఆరోపనలు చేశారు.
బాబు ప్రతీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో రహస్యాన్ని అయన వెల్లడించారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగేందుకే చంద్రబాబు ఢిల్లీకి ఎక్కువగా వెళ్లారని కన్నా వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే చంద్రబాబు ఫోకస్ ఎక్కువగా పెట్టారని అయన బాంబు పేల్చారు.
నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబుకు ఉండి వుంటే కచ్చితంగా కేంద్రం సహకరించేది అన్ని తెలియజేశారు. గతంలో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలి అన్నపుడు...కేంద్ర క్యాబినెట్ ఏమీ ఆలోచించకుండానే అంగీకారం తెలిపిందని అన్నారు కన్నా.
అయితే రాష్ట్రంలో ప్రజలు.. ప్రతిపక్ష నాయకులు జగన్ ప్రత్యేకహోదా స్వరం గట్టిగా వినిపించడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఈ క్రమంలో బీజేపీ పార్టీ ని రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేశారని అన్నారు. అయితే చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో ఇన్నిసార్లు...మాటలు మార్చడంతో చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మడం లేదని అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బిజెపి పార్టీ కట్టుబడి ఉందని తెలియజేశారు.