గత కొన్ని రోజులుగా కర్ణాటకలో ఎన్నికల హడావుడి ఏ రేంజ్ లో కొనసాగిందో అందరికీ తెలిసిందే.  ఈ నెల 12న కర్ణాటక ఎన్నికలు జరుగగా..15 న ఫలితాలు వెలువడ్డాయి. అయితే 104 సీట్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని చెప్పిన వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకొని 116 సీట్లు కావడంతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  ఈ నేపథ్యంలో గవర్నర్ బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పను సీఎంగా ప్రమాణా స్వీకారం చేయించింది.
Image result for karnataka polling
అయితే నాటకీయ పరిణామాల మద్య అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బలనిరూపణకు ముందే తప్పుకున్న బీఎస్ యడ్యూరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. ఈ నెల 12 న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. ‘విజయ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలోని తాత్కాలిక షెడ్డులో ఓటర్ నమోదు ధ్రువీకరణ మెషిన్లు(వీవీపీఏటీ) దర్శనమిచ్చాయంటే ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
Image result for karnataka polling
ఈసీ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని యడ్యూరప్ప లేఖలో పేర్కొన్నారు.ఈవీఎంలపై రాజకీయ పార్టీల విమర్శలకు బదులిచ్చేలా రసీదు వచ్చే యంత్రాల ఉపయోగించాలని కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్లు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ బూత్‌లోనే ఈ మెషిన్ అందుబాటులో ఉండగా..వీటిని 5 శాతం వరకు పెంచాలని సీఈసీతో జరిగిన భేటీలో మాజీ అధికారి నజీం జైదీ సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: