బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ (21) గుండెపోటుతో మరణించాడు. మంగళవారం రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ముషీరాబాద్‌లోని గురునానక్ ఆస్పత్రిలో వైష్ణవ్ గుండెపోటుతో మరణించారు.

ఆయన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నారు. కుమారుడి మరణంతో బండారు దత్తాత్రేయ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులో వైష్ణవ్‌ గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బండారు దత్తాత్రేయ ప్రస్తుతం లోకసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
 bandaru dattatreyas son dies with heart attack
మొన్నటి వరకు మోడీ కేబినెట్లో మంత్రి‌గా ఉన్న ఆయన.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో పదవిని కోల్పోయారు.ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలిసిన పలువురు నేతలు దత్తాత్రేయను పరామర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: