చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయలేదని అన్నారు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనపై హత్యాప్రయత్నం చేయడానికి కొంతమంది పన్నాగాలు పన్నారని..ఈ క్రమంలో కిరాయి రౌడీలు తన బస చేస్తున్న స్థలం దగ్గరికి వచ్చి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా కరెంటు కూడా తీసేశారు అని అన్నారు.
అయితే కానీ తాను అన్నింటికి తెగించి వచ్చాను. కిరాయి గూండాలు వస్తూ చూస్తూ ఊరుకుంటానా? వారి బట్టలు ఊడదీసి కొడతా...అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కామెంట్స్ విన్నా పొలిటికల్ ఎనలిస్టులు పవన్ తాను ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి చేస్తున్న పిచ్చి కామెంట్స్ అని అంటున్నారు.
వాస్తవంగా పవన్ కి చుట్టుపక్కల చాలామంది భద్రతాసిబ్బంది కలిగి ఉంటారు..ఇటువంటి పరిస్థితులలో ఎవరు పవన్ మీద దాడి చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయ నాయకుడు లా కాకుండా..కేవలం హీరో లాగానే చూస్తున్నారని పేర్కొన్నారు.