పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బైచెప్పి ఇటీవల పూర్తిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజాపోరాట యాత్ర అంటూ జనసేన పార్టీ తరఫున రాష్ట్రమంతా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్  పూర్తి రాజకీయనాయకుడిగా మారిపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబుని కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గాని ఏ ఒక్క మాట అనని పవన్ కళ్యాణ్..తాజాగా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి...ప్రజాపోరాట యాత్రలో చంద్రబాబుపై చెలరేగిపోతున్నారు.
Image may contain: 1 person, crowd and outdoor
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రానికి ఎటువంటి మేలు చేయలేదని అన్నారు. అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న పవన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనపై హత్యాప్రయత్నం చేయడానికి కొంతమంది పన్నాగాలు పన్నారని..ఈ క్రమంలో కిరాయి రౌడీలు తన బస చేస్తున్న స్థలం దగ్గరికి వచ్చి దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అంతేకాకుండా కరెంటు కూడా తీసేశారు అని అన్నారు.
Image may contain: 1 person, standing, crowd and outdoor
అయితే  కానీ తాను అన్నింటికి తెగించి వచ్చాను. కిరాయి గూండాలు వస్తూ చూస్తూ ఊరుకుంటానా? వారి బట్టలు ఊడదీసి కొడతా...అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరోపక్క పవన్ కళ్యాణ్ కామెంట్స్ విన్నా పొలిటికల్ ఎనలిస్టులు పవన్ తాను ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవడానికి చేస్తున్న పిచ్చి కామెంట్స్ అని అంటున్నారు.
Image may contain: 2 people, crowd and outdoor
వాస్తవంగా పవన్ కి చుట్టుపక్కల చాలామంది భద్రతాసిబ్బంది కలిగి ఉంటారు..ఇటువంటి పరిస్థితులలో ఎవరు పవన్ మీద దాడి చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రాజకీయ నాయకుడు లా కాకుండా..కేవలం హీరో లాగానే చూస్తున్నారని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: