తిరుమ‌ల  శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామికి టిడిపి నేతలు కులాన్ని ఆపాదిస్తున్నారా ?  కుల‌, మ‌తాల‌కు అతీతంగా  ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల‌దిమంది భ‌క్తులు త‌మ కుల‌దైవంగా కొలుచుకునే వెంక‌న్న‌ను తెలుగుదేశంపార్టీ నేత‌లు త‌మ  సామాజిక‌వ‌ర్గానికి చెందిన దైవంగా పేటెంట్ హ‌క్కులేమ‌న్నా తీసుకున్నారా ? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. తెలుగుదేశం పార్టీ నేత‌ల‌కు పిచ్చి బాగా ముదిరినట్లే క‌న‌బ‌డుతోంది. చంద్ర‌బాబునాయుడు ప‌రిపాల‌న కేవలం త‌న సామాజిక‌వ‌ర్గానికి మాత్ర‌మే అనే ప్ర‌చారం ఒక‌వైపు ఉధృతంగా జ‌రుగుతున్న విష‌యం అందిరికీ తెలిసిందే. అదే సంద్భంలో త‌న చ‌ర్య‌ల ద్వారా చంద్ర‌బాబు పలు సామాజిక‌వ‌ర్గాల‌ను చేతులారా దూరం చేసుకుంటున్నారు. ఈ ప‌రిస్ధితుల్లో టిడిపి నేత‌లు చేస్తున్న పిచ్చి వ్యాఖ్య‌లు పార్టీకి బాగా చేటు తెచ్చేదిగా క‌నిపిస్తోంది. 

Image result for chandrababu tirumala

బిజెపిని వెంక‌న్న చౌధరే అడ్డుకున్నారా ? 
ఇంత‌కీ విష‌యం ఏమిటంటే రాజ‌మండ్రి ఎంపి ముర‌ళీ మోహ‌న్ తిరుమ‌ల శ్రీ‌వారి విష‌య‌లో చేసిన  వ్యాఖ్య‌లు తాజాగా క‌ల‌క‌లం రేపుతోంది. క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి  రాలేక‌పోవ‌టానికి తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామే కార‌ణ‌మ‌ట‌. అంత వ‌ర‌కూ అని ఊరుకుంటే బాగానే ఉండేది. కానీ త‌ర్వాత చేసిన వ్యాఖ్య‌ల‌పైనే అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌ర్నాట‌క‌లో బిజెపికి అనుకున్న విధంగా సీట్లు రాక‌పోవ‌టానికి తిరుమ‌ల వెంక‌న్న చౌధ‌రే కార‌ణ‌మ‌ని ముర‌ళీ మోహ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఎంపి చేసిన వ్యాఖ్య‌లు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రాజ‌మండ్రిలోని కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎంపి పై వ్యాఖ్య‌లు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: