దేశంలో ప్రతిరోజూ మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలలోనే చిన్నారులపై అత్యాచారాలు జరిగిన సంఘటన హృదయాలను కలచి వేస్తుంది.  ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని..నింధితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాంగానికి సీరియస్ గా చెప్పారు. కానీ వెంట వెంటనే మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగడం లా అండ్ ఆర్డర్ పూర్తిగా తప్పిపోయిందనడానికి సంకేతాలు వినిపిస్తున్నాయి. 
Image result for dachepally rape
దాచేపల్లి ఘటన మరువక ముందే మరో సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత అతడి నలుగురు స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. మూడు నెలలుగా వారు బాలికపై అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
11 years old girl raped by five minors in punganur
రోజు రోజుకీ ఆ బాలిక ప్రవర్తనలో మార్పు రావడం..భయం భయంగా ఉండటం చూసి తల్లి  నిఘా పెట్టి జరిగిన ఘోరాన్ని పసిగట్టింది. వెంటనే భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా వారంతా మైనర్లు కావడంతో కాస్త ఆలోచనలో పడ్డారు. బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు ధృవీకరించారు. 
Image result for dachepally rape
ఇదిలా ఉంటే విషయం తెలుసుకున్న స్థానికులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో నలుగురు మైనర్లను పట్టుకొని చితకబాదారు.  విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయి..బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందుతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: