గత ఎన్నికలలో మమ్మల్ని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అలాగే విభజన చట్టం నుండి రావలసిన అన్నిటిని తీసుకొస్తామని ఆనాడు తెలియజేశారు చంద్రబాబు. అయితే తర్వాత అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కనీసం ఇచ్చిన హామీలను అలాగే చట్టపరంగా కేంద్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన ప్రతి హామీని తుంగలోకి తొక్కారు.
న్యాయపరంగా చంద్రబాబు కేంద్రంలో అధికార పీఠంపై కూర్చున్న మోడీని ప్రశ్నించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అయితే చంద్రబాబు ప్రశ్నించక పోవడానికి గల కారణం వోటుకు నోటు కేసు అని ఇప్పటికే చాలామంది అంటున్నారు.
అయితే తాజాగా ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పార్టీలకు పరోక్ష సహకారం అందిస్తూ చంద్రబాబు చేసిన అత్యుత్సాహం కేంద్ర పరిధిలో కొంతమంది పెద్దలకు నచ్చలేదు ఈ నేపథ్యంలో వోటుకు నోటు కేసు బయటకు తీయాలని ఆలోచిస్తున్నారట కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు. దీంతో ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు తెగ టెన్షన్ పడిపోతున్నారట.