టీడీపీ తెలంగాణలో పూర్తిగా నాశనమైందని, ఇప్పుడు స్మశానంలా ఉందని, మళ్లీ మొక్క పెట్టి నీళ్లు పోయాలని టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యానించడం టీడీపీ వర్గాలను షాక్ కు గురిచేసింది. చంద్రబాబు కంటే కేసీఆరే నయమని మోత్కుపల్లి వాఖ్యానించి పార్టీలోని ప్రతి ఒక్కరు అవాక్కయ్యేలా చేశాడు. నేడు శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన టీడీపీ పైన మరియు ఆ పార్టీ అధినేతపైన  సంచలన వాఖ్యలు చేశాడు.


ఆయన మాట్లాడుతూ తాను ఏం తప్పుచేశానొ అధినేత చంద్రబాబు తనకు తెలియజేస్తే సంతోషిస్తానని తెలిపాడు. డబ్బులు లేకున్నా ఎన్టీఆర్ ఆశీస్సులు ఆలేరు ప్రజల ఓట్లతో గెలిచానని తెలిపాడు. తన తప్పు తెలియజేస్తే ముక్కు నేలకు రాస్తానని ఆయన చెప్పుకొచ్చాడు.  రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ నాశనమైందని ఆయన విమర్శించాడు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన మూల సిద్ధాంతాలతో పార్టీ నడవాలా వద్దా అని ఆయన చంద్రబాబుకు సూటి ప్రశ్న వేశాడు.


అంతేగాక ఆయన తనకు పార్టీలో ప్రస్తుతం జరగుతున్న అవమానాలను చెప్పుకొచ్చాడు. తనను పార్టీ మీటింగులకు పిలవరని, కనీసం టెలీకాన్ఫరెన్స్‌లో లైన్ ఇవ్వరని ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలపాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి ప్రశ్న సంధించాడు. తాను ఏ నేరం చేయకున్నా పార్టీ నుండి బయటకు పంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీడీపీ నిలబడడం కష్టం అయినా తాను  పార్టీని వీడకుండా ఉన్నట్లు ఆయన తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: