ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు పాలనలోని లోపాలను ఎండగడుతూ తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని ఓట్లర్లను అడుగుతున్నాడు. ప్రస్తుతం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తూన్నాడు. కాగా నేడు ఉండి నియోజకవర్గంలో యాత్ర చేస్తున్న ఆయనను సినీనటుడు పోసాని కృష్ణమురళి కలిసాడు.


జగన్ తో కలిసి ఆయనకు మద్దతుగా రెండు కిలోమీటర్లు నడిచిన అనంతరం ఆయన ఒక  మీడియా సంస్థతో ముచ్చటించాడు. ఆయన మాట్లాడుతూ-  అంత మండుతున్న ఎండలో, దుమ్ముదూళిలో మూడువేల కిలోమీటర్ల నడవడం మామూలు విషయం కాదని, జగన్ చేస్తున్న ఈ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు. జగన్ లోని దృఢసంకల్పం, తపన వంటి ఆయన గుణాలకు ఆకాశమే హద్దు అని ఆయన చెప్పారు.


 జగన్ మిగితావ్యక్తుల లాగా అబద్దపు హామీలిచ్చి ప్రజలను మోసం చేసే వ్యక్తి కాదని చెప్పాడు. జగన్ కు మీరు ఒక్కసారి ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారని ప్రజలకు తెలిపాడు.జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా పనిచేస్తాడని పోసాని చెప్పుకొచ్చాడు. అలా కాని పక్షంలో తనను చెప్పుతో కొట్టండి అని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: