పవన్ కళ్యాణ్ సినిమా లను వదిలేసి జనాల్లోకి వచ్చాడు. జనసేన పార్టీ పెట్టి ప్రజలకు అండగా ఉంటానని ప్రకటించాడు. అయితే జనసేన మొదటి నుంచి కూడా వ్యూహాలు లేకుండా ఒక నిర్దిష్టమైన కార్య చరణ లేకుండా వెళుతుందని విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే జనసేన కూడా మరో ప్రజారాజ్యం పార్టీ అవ్వక తప్పదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీక్ష రిసార్ట్ లో చేయడం పవన్ కళ్యాణ్ నిబద్దత ను తెలియజేస్తుంది.
సాధారణంగా రాజకీయ నాయకులు కావాలనుకొనేవారందరూ కొన్ని రకాల అగ్నిపరీక్షలకు సిద్ధపడాలి. వీటిలో మొదటిది శారీరక శ్రమ. అవసరమైనప్పుడు.. సమయం కాని సమయంలో కూడా ఎలాంటి పరిస్థ్థితుల్లోనైనా ఎంత మారుమూలకైనా వెళ్లాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్త్తే సౌకర్యాలు ఎంతో మెరుగుపడినా-ఎండ, వానలాంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్భాటంగా తన పాద యాత్రను ప్రారంభించిన పవన్ జనాల మధ్యే దీక్ష కూడా చే స్త బావుండేది.
ఉద్దానంలో మత్స్యకారుల ఇంట్లో దీక్ష చేస్తే పోయేదేముంటుంది? ఎన్టీఆర్ చైతన్యరథం మీద యాత్ర చేస్తున్నప్పుడు రోడ్ల మీద స్నానం చేసిన ఫొటోలు ఎంత సంచలనం సృష్టించాయో పవన్ కు, ఆయన వ్యూహకర్తలకు తెలియదా? ప్రజల దగ్గరకు తాను వెళ్తునానని కాకుండా ప్రజలే తనను చూడటానికి వస్తున్నారనే బాడీ లాంగ్వేజ్.. విలాసంగా రిసార్ట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్న ఫొటోలు ఆయన ఇమేజ్ను దెబ్బతీసేవే! పవన కళ్యాణ్కి ఒక మేధావి ఇమేజ్ లేదని.. మాస్ స్టార్ ఇమేజ్ ఉందనే విషయాన్ని ఆయన వ్యూహకర్తలు గుర్తించాలి.