భారత్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీకే ఓటు వేస్తామని దాదాపు నాలుగింట మూడొంతుల మంది చెప్తున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాలుగేళ్ళ పరిపాలన పూర్తయిన సందర్భంగా ప్రముఖ వార్తా మాద్యమం "టైమ్స్ గ్రూప్" (తొమ్మిది మాద్యమాలు) నిరాటంకంగా నిర్విరామంగా నిర్వహించిన ఆన్లైన్ సర్వే లో ఈ విషయం వెల్లడైంది.
తమ సంస్థకు చెందిన 9వార్తా మాధ్యమాల ద్వారా 9భాషల్లో సర్వే నిర్వహించినట్లు "టైమ్స్ గ్రూప్" తెలిపింది. ఈ నెల 23నుంచి 25వరకు అంటే మూడు రోజుల సర్వే ఆన్లైన్ లో జరిగినట్లు పేర్కొంది. టైమ్స్ గ్రూప్ సంస్థ ప్రకటించిన సర్వే నివేదిక సమాచారం ఏమంటే:
ఈ సర్వేలో 8,44,646 మంది పాల్గొన్నారు. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటు వేస్తారు? అనే ప్రధాన ప్రశ్నకు:
71.95 శాతం మంది నరేంద్ర మోదీకేనని చెప్పారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టాలని వీరు కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీ ప్రభుత్వమే వచ్చే అవకాశం ఉందని 73.3శాతం మంది చెప్పారు.
ఆ అవకాశం మోదీ కాకుండా వేరే ఎవని ప్రధానిగా ఆహ్వానిస్తారని అంటే, రెండవ స్థానం మాత్రం రాహుల్ గాంధికి ఇవ్వకుండా, వేరే ఎవరైనా ఇతరులకు దక్కాలని భావించే వారు 16.12శాతం మంది పేర్కొన్నారు. ప్రధాన మంత్రి పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలని కోరుకునేవారు 11.93శాతం మంది ఉన్నారు.
ఎన్డీయే పాలనలో మైనారిటీలకు అభద్రతా భావం లేదని 59.41శాతం మంది తెలిపారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం చాలా బాగుందని 62.63శాతం మంది తెలిపారు.
మోదీ ప్రభుత్వ పని తీరు బాగుందని 20.60శాతం మంది, చాలా బాగుందని 47.47శాతం మంది చెప్పారు. 11.38శాతం మంది అత్తెసరు మార్కులతో పర్వాలేదు అని చెప్పారు ఏమీ బాగులేదని 20.55మంది చెప్పారు.
ఈ సర్వే "మూడ్ ఆఫ్ ది నేషన్" పేరిట "ఏబిపి-సి ఎస్ డి ఎస్" సర్వే కి పూర్తి వ్యతిరేఖంగా వచ్చింది. ఈ సర్వే "చాలా విస్త్రుతంగా దేశంలో అత్యధిక బాగం కవర్ చేసిన "పల్స్ ఆఫ్ ది నేషన్" ఇందులో ఎనిమిది లక్షల నలభై ఐదు వేల మంది మూడు రోజుల్లో స్పందించారు.