జనసేన కూడా ఎన్నికల భరిలో దిగుతుండటంతో ఈ సారి ఆంధ్ర ప్రదేశ్లో త్రిముఖ పోరు తప్పేటట్లు కనిపించడం లేదు. అయితే ఈ మూడు పార్టీ లు ప్రజల కు చేరువ అయ్యేందుకు రాష్ర పర్యటనలో బిజీ గా ఉన్నారు. ప్రతి పక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తో గోదావరి జిల్లాలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా పోరాట యాత్ర పేరు తో యాత్ర చేస్తున్నాడు. అధికార పార్టీ అయినటువంటి టీడీపీ మినీ మహానాడు పేరు తో ప్రజలకు దగ్గర అవుతుంది.
ఇటీవలి కాలంలో జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్, ప్రతిపక్ష వైకాపా, బీజేపీ నేతలు సంధిస్తోన్న విమర్శనాస్త్రాలకు ధీటుగా ప్రజల్లో ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించడంతో ఆయా అంశాలపై నేతలు ప్రతిపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలివుండటంతో ఇకపై ఎన్నికలే లక్ష్యంగా సాగేందుకు టీడీపీ శ్రేణులు వివిధ కార్యక్రమాలతో సిద్ధమవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్రెడ్డి జూన్ మొదటివారంలో తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేశించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు నియోజకవర్గాల స్థాయిలో జగన్కు మద్ధతుగా పాదయాత్రలు నిర్వహించారు. మరోవైపు వైకాపా నేతలూ మండుటెండల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు.