నంద మురి తారక రామ రావు టీడీపీ పార్టీ ని స్థాపించారన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే రామ రావు నుంచి చంద్ర బాబు నాయుడు టీడీపీ పార్టీ ని వశ పరుచుకున్నాడు. అప్పుడు రామ రావు కూడా ఎంతో వేదనకు గురై చంద్ర బాబు నమ్మక ద్రోహి అని మాట్లాడినాడు. అయితే ఇప్పటికి టీడీపి నారా కుటుంబమే కనుసన్నల్లో ఉంది. అయితే మహానాడు రోజున పురంధేశ్వరి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.
ఇక చంద్రబాబు తర్వాత ఆ పార్టీని ఎవరు లీడ్ చేస్తారన్న ప్రశ్న కూడా కొద్దిరోజులుగా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్ పెద్దగా రాణించలేకపోతున్నారన్న అభిప్రాయం పెరుగుతున్నందున బహుశా జూనియర్ ఎన్టీఆర్ తిరిగి పార్టీకి పెద్దదిక్కుగా మారతారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి అన్నీతానే అవుతాడని,అంతకుమించి మరో ప్రత్యామ్నాయం లేదనేది రాజకీయ ఉద్ధండుల వాదన.
తాజాగా జరుగుతున్న మహానాడుకు సంబంధించి పురంధేశ్వరి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తన తండ్రి బాటలో పయనించిన హరికృష్ణ,బాలకృష్ణలు ముఖ్యమంత్రి కాకపోవడం చాలా బాధగా ఉందని, చంద్రబాబు స్థానంలో తన సోదరులు ఉండాల్సిందని,కానీ తమ కుటుంబాన్ని పార్టీకి దూరం చేస్తూ, అధికారకాంక్షతో ఎదగనీయకుండా బాబు అడ్డుపడుతున్నాడని ఆమె ఆరోపణలు గుప్పించింది. ఎప్పటికైనా హరికృష్ణ,బాలకృష్ణలు ముఖ్యమంత్రి అవుతారని భావించానని,కానీ చంద్రబాబు ఉన్నంత కాలం అది జరగకపోవచ్చని ఆమె వాపోయింది.