తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే 34 టీడీపీ‘మహానాడు’ కార్యక్రమం ఘనంగా ప్రారంభైన విషయం తెలిసిందే. విజయవాడలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరుగుతున్న మహానాడును టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు  ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  చంద్రబాబు డ్వాక్రా బజార్‌, ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభించి, రక్తదాతలను అభినందించారు.
tdp mahanadu 2018: ap cm started at vijayawada

ఇక మహానాడు చరిత్రలోనే ఈసారి అతి పెద్ద వేదికను ఏర్పాటు చేశారు. సుమారు 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ వేదికపై దాదాపు 400 మంది వరకు కూర్చునే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నమూనాల్ని వేదిక ముందు భాగంలో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ప్రధాన వేదిక పక్కనే 30 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో మరో వేదిక సిద్ధం చేశారు. రోజుకు దాదాపు 40 వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో 15 వేల మంది కూర్చోవడానికి ఏర్పాట్లు చేశారు. 


2019 సాధారణ ఎన్నికలకు ముందు జరిగే చివరి మహానాడు ఇదే కావడంతో ఈ వేదిక నుంచే శంఖారావం పూరించనుంది. వచ్చే సంవత్సరకాలంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ప్రధాన లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా విజయవాడలో జరుగుతోన్న తెలుగుదేశం మహానాడులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న రక్తదాన శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. రక్తదానం చేస్తోన్న కార్యకర్తలను ఆయన అభినందించారు.

రక్తదానం తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం ఏపీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, అనుకున్న లక్ష్యానికి వాటర్ గ్రిడ్ కూడా పూర్తి చేసిందని తెలిపారు.   ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, ఆమధ్య నంద్యాల ఉప ఎన్నికలోనూ, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తామే విజయం సాధించామని లోకేశ్‌ అన్నారు.  ఏనాడూ ఆస్తులు ప్రకటించని కొందరు నేతలు తమపై అవినీతి ఆరోపణలు చేయడం చూస్తుంటే..చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: