ప్రజాసంకల్ప యాత్ర పేరుతో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెండువేల కిలోమీటర్ల మైలురాయిని దాటిన జగన్  ప్రస్తుతం మూడువేల కిలోమీటర్లవైపుకు అడుగులేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగిస్తున్న ఆయన యాత్ర నేటితో 175వ రోజుకు చేరుకుంది. 


కాగా జగన్ పాదయాత్రలో సినీనటులు బాగానే పాల్గొంటున్నారు. జగన్ తో కలిసి నడుస్తూ ఆయనకు మద్దతిస్తున్నారు. మొన్న టాలీవుడ్ రచయిత, నటుడు పోసాని మురళీకృష్ణ జగన్ ను కలిసి ఆయనకు సంఘీభావంగా ఒక రెండు కిలోమీటర్ల మేర ఆయనతో నడిచిన సంగతి తెలిసిందే. తాజాగా మరో టాలీవుడ్ నటుడు, హాస్య పాత్రధారుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్ జగన్ ను కలిశారు.


మొన్న ఇంటర్వ్యూ లో కమెడియన్ పృథ్వి బాబును తీవ్రంగా విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ పాలన కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్ ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తారని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే  నేడు అనూహ్యంగా భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో కనిపించి అందరినీ అబ్బురపరిచాడు. జగన్ తో కలిసి వైసీపీ జెండా మోసుకుంటూ  ఆయన కొంతదూరం పాదయాత్రలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: