జేసీ సభలో మాట్లాడే తీరు కొంచెం భిన్నముగా ఉంటుంది. ఒక పొగుడుతూనే మరో పక్క విమర్శలు చేస్తుంటాడు ఇప్పటికే నాలో ప్రవహించే రక్తం కాంగ్రెస్ దే అంటుంటాడు. అయితే నిన్న జరిగిన మహానాడు సభలో ఒక పక్క జగన్ ను తిడుతూ, బాబుకు భజన బాగా చేసాడు. ఆ భజన కొంచెం శృతి మించిదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ఆ భజన లో కొంచెం వాస్తవం కూడా చెప్పాడు. 

Image result for jc diwakar reddy

చినబాబును పొగుడుతూ, 'లోకేష్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలున్నాయి. లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారు. దీనికి ఆయన సమర్థుడే కదా' అని సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇదంతా భజన. మరి ఉన్నమాటేమిటి? 'నేను సంపాదించిన ఆస్తి నా కొడుక్కు ఇవ్వనా? అలాగే టీడీపీ కూడా చంద్రబాబు సొంతం. ఆయన తన బాధ్యతలను తన కొడుక్కి ఎందుకివ్వకూడదు?'  అన్నారు. అంతటితో ఆగలేదు. 'టీడీపీ ముమ్మాటికీ చంద్రబాబు సొంతం. ఈ విషయంలో ఆయన్ని ప్రశ్నించే అర్హత ఎవ్వరికీ లేదు' అని తేల్చిపారేశాడు.

Image result for jc diwakar reddy

ఇందులో అవాస్తవం, వాస్తవం రెండూ ఉన్నాయి. అవాస్తవం ఏమిటంటే టీడీపీ చంద్రబాబు సొంత ఆస్తి కాదు. ఎన్టీఆర్‌పై దౌర్జన్యం చేసి బలవంతంగా కబ్జా చేసిన ఆస్తి. ఎన్టీఆర్‌ ఈయన్ని తన రాజకీయ వారసుడిగా ఏనాడూ ప్రకటించలేదు. తన తరువాత పార్టీ బాధ్యతలు బాబు తీసుకోవాలని ఏనాడూ చెప్పలేదు. జగన్‌, పవన్‌ మాదిరిగా సొంతంగా పార్టీ పెట్టుకున్నట్లయితే సొంత పార్టీ అని చెప్పుకోవడానికి అర్హత ఉంది. ఇక వాస్తవం ఏమిటంటే..మన దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ వారసత్వ పార్టీలుగా మారిపోయాయి. దీన్ని ప్రజలూ అంగీకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: