జగన్ పాదయాత్ర లో పాల్గొనడానికి సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరు తరలి వస్తున్నారు. మొన్న పోసాని మురళి కృష్ణ వస్తే ఈ సారి కమెడియన్ పృథ్వి వచ్చి పాల్గొన్నాడు. ఈ సందర్బంగా పృద్వి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినాడు. జగన్ వెంట నడవటానికి సినీ ఇండీస్ట్రీ మొత్తం సిద్దమగా ఉందని, త్వరలోనే ఇంకా చాలా మంది వస్తారని అభిప్రాయం పడ్డాడు. ఇంకా పృథ్వి చంద్ర బాబు సర్కార్ మీద పదునైన విమర్శలు చేసినాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో మంతెపూడి క్రాస్ వద్ద జగన్ ను కలిశారు పృధ్వి. జననేత సాగిస్తున్న మహాసంకల్ప యాత్రకు మద్దతు తెలుపుతూ, దాదాపు 4గంటల పాటు అతనితో కలిసి నడిచారు. ఈ సందర్భంగా పరిశ్రమను ఉద్దేశించి పృధ్వి చేసిన వ్యాఖ్యలివి. జగన్ కు మద్దతివ్వడం వల్ల ఇండస్ట్రీలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవని అంటున్నారు పృధ్వి.
"సినిమా ఇండస్ట్రీ పరంగా మాకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. మాకు ఎవరు నచ్చారో మేం చెప్పుకుంటాం. అందులో తప్పులేదు. నాకు రాజశేఖర్ రెడ్డి గారు నచ్చారు. కాబట్టి జగన్ పక్కనుంటాను. మరికొందరికి చంద్రబాబు నచ్చొచ్చు. వాళ్లు అటు పక్క ఉంటారు. అంతే తప్ప, అంతకుమించి పరిశ్రమలో ఇబ్బందులు ఎదురు కావు." ఇది పృధ్వి చెబుతున్న మాట. 40ఏళ్ల వయసు ఉన్న జగన్ ముందు 40 ఏళ్ల అనుభవం చంద్రబాబు తలవంచాల్సిందేనని.. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఏపీ సీఏంగా జగన్ గద్దెనెక్కడం ఖాయం అంటున్నారు పృధ్వి.