జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పై మాటల దాడి మరింత పెంచారు. గత ఎన్నికలలో మీకు మద్దతు తెలిపి ప్రజలను మోసం చేసిన  వాడినైనా అని అన్నారు. గత ఎన్నికలలో పోటీ చేయకుండా కేవలం చంద్రబాబుకు మద్దతు తెలిపింది అభివృద్ధి చేయడానికి గాని అవినీతి కోసం కాదని అన్నారు.
Image may contain: 3 people, people sitting, people standing and beard
అయితే నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వం నాయకులు అందిన దాన్ని కల దోచుకుని అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కేంద్రం నుండి రావలసిన ప్రత్యేకహోదా హామీని చంద్రబాబు తుంగలోకి తొక్కారు అని అన్నారు.. ముఖ్యమంత్రి 40 సంవత్సరాల అనుభవం ఇసుక దోపిడీకి పనికొచ్చిందని ఎద్దేవా చేశారు.
Image may contain: 1 person, beard
తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సంపూర్ణంగా అవినీతిలో మునిగిపోయిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల పాలకొండ, రాజాం సభల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అభివృద్ధి అంతా అమరావతిలో చేస్తూ ఉత్తరాంధ్రకు తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోందని అన్నారు.
Image may contain: 1 person, sitting and beard
ఒక్కో ఎమ్మెల్యే ఇసుక మాఫియా ద్వారా 30 కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. మొత్తంమీద ఇప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏమి చేసింది అని రెండు ముక్కల్లో చెప్పాలంటే  భూకబ్జాలు ఇసుక మాఫియా ఆయన నిర్మొహమాటంగా చెప్పవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు పవన్. అంతేకాకుండా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నీ నామరూపాల్లేకుండా చేస్తానని నేను ఓడిపోయిన టిడిపిని గెలవకుండా చేస్తాను అని అన్నారు...ప్రజలను ఇంతగా దోచేసే నాయకులు సమాజంలో ఉండటం ప్రజాశ్రేయస్సుకు ప్రమాదకరమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: