దేశ వ్యాప్తంగా 4 లోక్‌సబ, 11 అసెంబ్లి స్థానాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రానికల్లా తుది ఫలితాలు వెల్లడించనున్నట్టు ఎలక్షన్ కమిసన్ అధికారులు తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 4 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జరిగాయి. కౌరానా (యూపీ), పాల్‌ఘర్‌ (మహారాష్ట్ర), భండారా-గోందియా (మహారాష్ట్ర), నాగాలాండ్‌లో ఒక లోక్‌సభ స్థానంలో ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు.
Bye-Elections 2018
కైరానాలో బీజేపీ ఎంపీ హుకుమ్‌ సింగ్‌ మృతి చెందడంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఇక్కడ ఆయన కుమార్తె మ్రిగాంకా సింగ్‌ పోటీ పడగా.. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ మద్దతుతో ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి హసన్‌ ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. దీంతో గెలుపు ఎవరివైపు వుటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Image result for దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ
ఇదిలావుంటే రెండు నెలల కిందట ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌‌ నియోజకవర్గాల్లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో ఎలాగైనా ఈసారివిజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది.
Image result for దేశ వ్యాప్తంగా 4 లోక్‌సభ
అలాగే పలుస్‌ కడేగావ్‌ (మహారాష్ట్ర), జోకీహాట్‌ (బీహార్‌), గోమియా, సిల్లి (ఝార్ఖండ్‌) , చెంగన్నూర్‌ (కేరళ), అంపటి (మేఘాలయ), థరాలీ (ఉత్తరాఖండ్‌), నూర్‌పూర్‌ (యూపీ), షాహ్‌కోట్‌ (పంజాబ్‌), మహేప్తలా (బంగాల్‌) అసెంబ్లి స్థానాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: