టీడీపీ లో జేసీ దివాకర్ రెడ్డి అంటే చాలా బిన్నం అని చెప్పవచ్చు. ఉన్నది ఉన్నట్టు చెబుతాడు పార్టీ అధినేత అయిన తప్పులు ఉంటె విమర్శిస్తాడు ముక్కు సూటిగా మాట్లాడుతాడు. అయితే మహానాడు వేదికగా జేసీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినాడు. బాబు చేస్తున్న తప్పులను ప్రస్తావించాడు వాటిలో టెలీకాన్ఫెరెన్స్ కు సంభిందించి కొన్ని విషయాలు లేవనెత్తినాడు. టెలీకాన్ఫెరెన్స్ఎక్కువ అయిపోవడం వల్లన అధికారులు పనిచేయడం లేదని వాటిని తగ్గిస్తే మంచిదని చెప్పినాడు.
నిత్యం టెలీకాన్ఫరెన్స్ లతో మోతెక్కించే బాబు పుణ్యమా అని అధికారుల నుంచి ఫ్యూన్ల వరకూ ఎవరూ పని చేయటం లేదని.. ప్రజలకు తర్వాత నేతలకు సైతం అందుబాటులోకి ఉండటం లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.బాబుకు ఎవరూ మంచి మాటలు చెప్పరని.. తెగ పొగిడేస్తారు కానీ.. నిజాలు మాత్రం నోటి నుంచి రావని.. కానీ..తాను మాత్రం నిజాల్ని చెప్పకుండా ఉండలేనంటూ బాబు చేస్తున్న తప్పుల చిట్టాను తెలివిగా బయటపెట్టారు జేసీ.
బాబుపై ఆయన మాటలు బాగానే పని చేసినట్లు ఉన్నాయి. టెలీకాన్ఫరెన్స్ లు.. జన్మభూమి కమిటీల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే.. బాబు సర్కారు రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం ఇకపై వారానికి ఒక్క రోజు మాత్రమే టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాదు.. ఫించన్ల ఎంపిక కోసం ఉద్దేశించిన జన్మభూమి కమిటీలను ఎత్తి వేస్తూ.. ఆన్ లైన్లో ఎవరు అప్లై చేసినా.. జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.