గత కొంత కాలంగా భారత దేశంలో రోడ్డు ప్రమాదా సంఖ్య తీవ్రం అవుతూనే ఉంది.  ఈ ప్రమాదాలకు ముఖ్యకారణం ఎక్కువగా డ్రైవర్లు మద్య సేవించి నడపడం..నిద్ర లేమి కారణాల వల్లే జరుగుతున్నాయని అధికారులు తెల్పుతున్నారు.  ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది నిర్భాగ్యులు రోడ్డున పడుతున్నారు..కొంత మంది వికలాంగులుగా మిగిలిపోతున్నారు. 

తాజాగా మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్‌లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తవేరా వాహనం-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు.  మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వేకువ ఝామున ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: