మన పురాణ గాధల్లో రామాయణ, మహాభారతం ఎంతో గొప్పది. అయితే మహాభారతం పూర్తి రాజకీయ నేపథ్యంతో కూడుకున్నది..ఇందులో జూదం వల్ల ఎంత నష్టపోతారు..అన్నదమ్ములు సఖ్యతగా లేకపోతే కురుక్షేత్ర యుద్దమే వస్తుందని ఎన్నో కోణాలు కనిపిస్తాయి. ఇక పాండవులు జూదంలో తమ సతీమణి ద్రౌపతిని సైతం తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. అచ్చం మహాభారతంలో ద్రౌపదికి జరిగిన పరాభవాన్ని పోలిన దారుణం ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. జూదంలో ఓడినందుకు తన భార్యను వేరొకరికి తాకట్టు పెట్టాడు ఒక దుర్మార్గుడు.
ఈ ఘటన బాలాసోర్ జిల్లాలోని బలియాపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం మలంగ్బలికుతి గ్రామానికి చెందిన ఆ దంపతులకు 16 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈ మద్య పేకటలో ఓడినందుకు తన భార్యను తాకట్టుపెట్టడానికి భర్త సిద్ధమయ్యాడు. దీంతో పథకం ప్రకారం మే22న అర్ధరాత్రి తన భార్యను చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న గ్రామస్థుడు అభిరాం దలారుతో శారీరకంగా కలవాలని బలవంతం చేశాడు.
తన భర్తే ఇతరులతో శారీరకంగా కలవాలని కోరడం ఆ యువతికి ఆశ్చర్యపోయింది..ఇది తనకు ఇష్టం లేదని అక్కడ నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ దుర్మార్గులు ఆమెను నిర్మాణుష ప్రదేశానికి తీసుకు వెళ్లి లైంగిక చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతో చెప్పడంతో తన కూతురుకు న్యాయం చేయాలని బాధితురాలి తండ్రి గ్రామస్థులను కోరారు.
పంచాయితీ నిర్వహిం చినప్ఫటికీ బాధితురాలికి న్యాయం జరుగలేదు. దాంతో బాధితురాలు బలియాపాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ భర్త, దలారుపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. పైగా విషయాన్ని సెటిల్ చేసుకోవాలంటూ ఆమెకు ఉచిత సలహా ఇచ్చారు. చివరకు బాలాసోర్ జిల్లా ఎస్పీ జుగల్ కిషోర్ బానోత్ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.