ప్రజాస్వామ్య ప్రియులెవరూ నియంతృత్వాన్ని భరించలేరు. వెను వెంటనే వరుస వరుసగా ఎన్డీయేలో జరుగుతున్న పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ఆ అలయన్స్ నుండి వైదొలగిన తొలి భాగస్వామి టిడిపి కాగా ఇప్పుడు మరో ముఖ్య భాగస్వామి దూరమవనున్నారా? అయన ఇప్పటికే మోడీ వ్యూహంలో చిక్కుకొని శ్లేష్మంలో పడ్ద ఈగ లాగా కొట్టుకుంటున్నారా? అసలు మొదటకే మోసం జరిగిందని గుర్తించారా?
తన రాజకీయ భవిష్యత్ కోసం మరెదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా?
కొద్ది రోజులుగా ఆయన మృదువైన స్వరంలో కరకుదనం హెచ్చినట్లు
కనిపిస్తుంది ఆ మార్పులోని అసలు ఆంతర్యమేమిటి?
చూస్తుంటే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడచిన దారిలోనే ఆయన కూడా నడవటానికి సిద్ధమవుతున్నారా? నడుస్తున్నారా?
అంటే ఇటీవల ఆయన మాట్లాడుతున్న తీరు, విధానం చూస్తుంటే మాత్రం పరిస్థితులు అలాగే ఉన్నట్లు సమాధానం వస్తుంది.
ఇప్పుడు నరెంద్ర మోడీ ఆధిపత్యాన్ని సహించలేక పోతున్నారా? భరించలేకపోతున్నారా?
ఇంతకీ నరెంద్ర మోడీకి దూరమవుతున్న ఆస్నేహితుడెవరని ఆలోచిస్తున్నారా?
అయితే ఎవరో కాదు, జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్. నరెంద్ర మోడీకి సమవుజ్జీగా గతంలో ప్రధాని పదవికి పోటీగా ప్రచారంలో నిలిచిన నేటి బీహార్ ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈయన రాజకీయాలు ఒక పద్దతి ప్రకారం ఉంటాయి. పెడ దొరణులు తక్కువ. అసలే లాలు కుటుం అవినీతి ప్రభుత్వానికి కాన్సర్ లాగా తగులు కునే సమయంలో ఆయన మోడీ తో జతకట్టవలసి వచ్చింది. ఈ విషయం ప్రధానంగా రాజకీయ విశ్లేషకులకు ఆసక్తి కలిగిస్తుంది.
బిహార్ లో కొంతకాలం క్రితం 'బీజేపీ, జేడీయూల సంకీర్ణం' ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేశాయి. గత 2014ఎన్నికల్లో 'ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమి' గా ఏర్పడి
పోటీ చేసి విజయం సాధించి అక్కడ నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
అయితే లాలు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ అవినీతిని తట్టుకోలేక నితీష్ కుమార్
చివరకు బిజెపి మాయావలయం లో చిక్కుకున్నారు. బిజెపి - జెడియు ఒక నాటి మిత్రులే. ఎన్నికల సందర్భంగా నరెంద్ర మోడీ బీహార్ ప్రజలకు
అనేక హామీలు ఇచ్చారు. వెనకబడిన బీహార్ సమగ్రాభివృద్ధికి లక్షలకోట్లు కేటాయిస్తానని
ఆయన చెప్పారు.
కానీ, నాలుగేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వచ్చిపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం శివసేన పత్రిక 'సామ్నా' లో ఇదే విషయంపై ఘాటుగా వ్యాసాలు రాసి స్పందించింది. బీహారీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నరెంద్ర మోడీ నెరవేర్చలేదని విమర్శించింది. ఈ క్రమంలోనే నరెంద్ర మోడీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపింది. ఆయన క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మోడీ ప్రభుత్వం విప్లవాత్మకంగా తీసుకు రాబోతున్న "పౌరసత్వ లేదా సిటిజెన్-షిప్ బిల్లు" పై కూడా నితీష్ కుమార్ మండిపడ్డారు. ఒకవేళ ఈ బిల్లు పార్లమెంటులో చర్చకు వస్తే వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తను తన జేడీయూ సిద్ధంగా ఉన్నట్టు మే 17న తనను కలిసిన 'ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్' నేతలకు నితీశ్కుమార్ హామీ ఇచ్చారు. అదేవిధంగా మే 26న ఓ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ, మొదట 'పెద్దనోట్ల రద్దు' నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. బడాబాబులు ఒక చోటి నుంచి మరో చోటిని డబ్బు రవాణా చేసుకున్నారని, పాత నోట్లను కొత్తగా మార్చుకున్నారనీ, పేదలు మాత్రమే ఇబ్బందులు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మరునాడే, మే 27న నితీశ్కు కేంద్రం షాక్ ఇచ్చింది. తుఫాను బాధితుల సహాయం కోసం కేంద్రం ఇస్తామని చెప్పిన రూ. 1750 కోట్లలో, రూ.500 కోట్లను తగ్గించింది.
ఈ దెబ్బతో మోడీ నితీశ్ కుమార్లో అసంతృప్తి మరింతగా రగులుకుంది. అదే క్రమంలో మే 29న బీహార్ కి 'ప్రత్యేక హోదా' కావాలంటూ ఆయన స్వరంలో ఘాటు పెంచుతూ పాత డిమాండ్ నే మళ్లీ వ్యక్తం చేశారు. గతంలో ఆయన ఈ డిమాండ్ చేసినా, ఎన్డీయేతో మైత్రితో మరిచిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్ ను ముందుకు తెచ్చారు. వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్డీయే నుంచి శివసేన బయటకు వచ్చినట్లే వాకిట్లో నిలబడి ఉంది. టీడీపీ ఎన్టీఏ నుంచి తప్పుకుంది. ఈ రెండు పార్టీలూ నరెంద్ర మోడీ తీరుపై భగ్గుమంటు న్నాయి. ఇదే సమయంలో బీజేపీ యేతర పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏకమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా తన జెడియూతో సహా బయటకు వచ్చేందుకు సిద్దమౌతున్నట్లు సమాచారం.