రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు అప్పటి నుండి వీలు చిక్కినప్పుడల్లా బీజేపీని తనదైన శైలిలో విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం నేడు విజయవాడలో  ఏర్పాటుచేసిన నవనిర్మాణ దీక్షలో బీజేపీతో పాటు నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై సంచలన వాఖ్యలు చేశారు. 


విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో  ఏర్పాటుచేసిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, వైసీపీలో చేరతానని చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్న కన్నా లక్ష్మీ నారాయణ చివరికి బీజేపీకి అద్దె మైకుగా వైసీపీకి సొంతమైకుగా తయారయ్యే పరిస్థితి వచ్చినదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బీజేపీకి చెందినట్లుగానే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చాడు.


ఇటీవల దేశంలో బీజేపీ కార్యక్రమాలను గురించి ప్రస్తావించిన బాబు, ప్రధాని మోదీ, అమిత్‌షా ఎవరు సీఎంను చేస్తే వారు అవుతారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఆగడాలు చూస్తూ ఉంటే మొన్నీ మధ్య నటుడు శివాజీ వివరించిన ఆపరేషన్ గరుడ ఇదేనేమో అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. వేరే రాష్ట్రాలలో మీ కుట్రలు,  ప్రయోగాలు చేసుకోండి కానీ మా తెలుగుజాతి జోలికి వస్తే ఖబద్ధార్ జాగ్రత్తగా ఉండండి అంటూ ఈ మేరకు బాబు బీజేపీ శ్రేణులకు వార్నింగ్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: