విశేషమేమిటంటే ఇది కూడా ఒక ఆడియో టేపులో అడ్డంగా దొరకడం...కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు సంబంధించిన లైసెన్స్ల వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపు ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చలు రచ్చరచ్చగా జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఆపరేషన్ లైసెన్స్ల కోసం భారత ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోని ఫెర్నాండజ్, సంస్థ ఇండియా సీఈవో మిట్టు శాండిల్య మధ్య 33 నిమిషాల పాటు సాగిన ఈ ఆడియో సంభాషణలో పలు సంచలన విషయాలు ఉన్నాయి.
అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసు విషయమై కేంద్ర నిఘా సంస్థ సీబీఐ ఫెర్నాండజ్పై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. తాజాగా బయటపడిన ఈ కుంభకోణం ఆడియో టేపులో చంద్రబాబు అశోక్గజపతిరాజు పేర్లు బయటకు వచ్చాయి.
ఇదే విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది...చంద్రబాబుతో వ్యవహారాన్ని నైస్గా ప్లే చేస్తే మనం అన్నీ సాధించుకోవచ్చు అంటూ మిట్టు… ఫెర్నాడేజ్తో చెప్పడం ఆడియో టేపులో ఉంది. ఈ నేపద్యంలో ఇప్పటికే ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ త్వరలో అశోక్గజపతిరాజు ను చంద్రబాబును విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.