సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి లైంగికంగా లోబరచుకొని సినిమాలో ఒక చిన్న పాత్రకూడా ఇవ్వకుండా అమాయక ఆడపిల్లలను మోసం చేస్తున్న ఇండస్ట్రీలోనిచీకటి శక్తులను నిర్ములించాడనికి ఒక పోరాటాన్ని కొనసాగిస్తున్నది శ్రీ రెడ్డి. ఇన్నాళ్లు ఒక క్రమ పద్దతిలో సాగిన ఆమె పోరాటం ఒక్కసారిగా పవన్ కల్యాణ్ ను విమర్శించడంతో మొత్తం నీరుగారిపోయింది.


అయితే ప్రస్తుతం టీవీ షోలలో ఎక్కడా కనిపించకుండా సోషల్ మీడియా ద్వారా సంచలనాలు నమోదు చేస్తూ వస్తుంది. ఇన్నాళ్లు తోటి వారిపై కేవలం వివాదాస్పద వాఖ్యలు చేసిన ఆమె ఇప్పుడు మద్దతుగా నిలవడం ఆశ్చర్యానికి గురిచేసింది. తను మద్దతుగా నిలిచింది ఎవరివైపో కాదు ఆయనే మంత్రి లోకేశ్. ఒక వైపు మద్దతుగా నిలుస్తూనే పవన్ ను, జనసేనను పరోక్షంగా విమర్శలు గుప్పించింది.


ఆమె తన ఫేస్బుక్ పేజీలో రాసుకొస్తూ "నారా లోకేష్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు" అంటూ తెలిపింది. ఈ మధ్య పవన్ తన పోరాట యాత్రలో సైతం మంత్రి లోకేష్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా శ్రీరెడ్డి మంత్రి లోకేష్ కు మద్దతుగా నిలవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: