స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ..బాలీవుడ్ భామ అనుష్క శర్మ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కోహ్లీ అడే ప్రతి మ్యాచ్ లోనూ అనుష్క శర్మ తప్పకుండా వెళ్తుంది..తన భర్త కొట్టే సిక్స్, ఫోర్లు చూసి ఆడియన్స్ తో తెగ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ తాజాగా తమ కుటుంబ సభ్యులతో కలసి ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ తీసుకుని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.
ఎప్పుడూ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మను విడిచిపెట్టినట్టు కనిపించలేదు..ఎప్పుడూ ఈ జంట మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా కోహ్లీ తీసుకున్న ఫోటోలో మాత్రం అనుష్క ఎక్కడా కనిపించలేదు. అందులో కోహ్లీ తల్లి, సోదరి, ఆమె పిల్లలు ఉన్నారు. దాంతో నెటిజన్లు షాక్ తిన్నారు..అదేంటీ కోహ్లీజీ అనుష్క ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరికొంత మంది అనుష్క లేని ఫోటో బోసిగా ఉందని..ఆమె ఉంటే ఇంకా అందంగా ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె లేకుండానే కారులో ఎందుకు వెళుతున్నావంటూ మరికొందరు అడుగుతున్నారు. నెక్స్ట్ టైమ్ అనుష్క శర్మ లేకుండా సెల్ఫీ దిగకని మరొకరు కామెంట్ చేశారు.