తమిళనాడులో మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జ్ గా ఉన్న సినీ నటి నగ్మాను తప్పిస్తూ, మంగళవారం నాడు అధిష్ఠానం నిర్ణయం తీసుకోగా, దీని వెనుక ప్రస్తుతం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న మరో సినీ నటి ఖుష్బూ హస్తం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే తమిళనాట గత కొంత కాలంగా కాంగ్రెస్ లో వర్గపోరు నడుస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మద్య వివాదం చెలరేగుతుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు దిగుమతై, స్థిరపడిన నగ్మా, ఖుష్బూలు చానాళ్ల నుంచే ఒకరంటే ఒకరికి పడనట్టుగా వ్యవహరిస్తున్నారు.
Image result for congress
ఇద్దరూ కాంగ్రెస్ నేతలైనప్పటికీ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే నగ్మకు తమిళం సరిగా తెలియదు..ఈ విషయంలో ఖుష్బుకి కలిసి వచ్చింది.  ఎందుకంటే నటిగా ఉన్నప్పటి నుంచి ఖుష్భుని ఆరాదించే తమిళ తంబీలు ఎంతో మంది ఉన్నారు. ఖుష్బూలా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీ రాణిని లెక్క చేయకపోవడం అధిష్ఠానానికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం.
Image result for nagma kushboo
అసలు వివాదం ఎక్కడొచ్చిందంటే..ఓ బహిరంగ కార్యక్రమంలో ఖుష్బు, నగ్మాలు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఖుష్బుని నగ్మ కాస్త దూరంగా కూర్చొమని బహిరంగంగా ఆదేశించడంతో విభేదాలు మరింతగా పెరిగాయి. ఆమెను తప్పించాలని ఫిర్యాదులు వెల్లువెత్తగా, వాటిని ఖుష్బూ కూడా సమర్థించినట్టు తెలుస్తోంది. దీని ఫలితమే రాష్ట్ర ఇన్ చార్జ్ బాధ్యతల నుంచి నగ్మాకు ఉద్వాసనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: