ఇరాక్లో భారీ పేలుడు సంభవించడంతో 16మంది మృతి చెందారు. వందమందికి పైగా గాయపడ్డారు. సదార్ సిటీలోని ఆయుధ కర్మాగారంలో ఈ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 16మంది మృతి చెందగా.. సుమారు 90 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అధికారులు.
ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని , ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన మసీదు సమీపంలో జరిగినట్లు సమాచారం.
పేలుడు జరిగిన ప్రాంతంలోని ఇళ్లు, భవనాలు తీవ్రంగా ధ్వంసమైనట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయుధ బండాగారంలోని సామాగ్రిని ట్రక్కులో మరో చోటుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని సమాచారం