భారతీయ చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ ఈ మద్య రాజకీయాపై తనదైన స్టైల్లో స్పందిస్తున్నారు.  ముఖ్యంగా బీజేపీపై ఏ చిన్న ఛాన్స్ దొరికినా కడిగి పాడేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ గౌరీశంకర్ హత్య విషయంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు.  అంతే కాదు కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాదని ఢంకాబజాయించి మరీ చెప్పాడు. 
Image result for gouri sshankar murder prakesh raj
ఇదిలా ఉంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్,జేడీఎస్ మిత్రపక్షాలుగా అధికారంలోకి వచ్చాయి. కానీ అక్కడ ఇంకా టెన్షన్ వాతావరణమే కొనసాగుతుంది.  తాజాగా కర్ణాటక నేతలపై నటుడు ప్రకాష్ రాజు మరోసారి విమర్శలు చేశారు. కన్నడనాట రాజకీయాలను తన వ్యాఖ్యల్లో తీవ్రంగా తప్పుబట్టారు. 

‘‘కర్ణాటక రాజకీయాలు..!! ఒక పార్టీ బీజేపీ డబ్బు, అధికారంతో లాబీయింగ్ కు ప్రయత్నించింది... మీరు కాంగ్రెస్/జేడీఎస్ నేతలు మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నారు... రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముకుంటున్నారు. ఎంత కాలం పాటు మీరు పౌరులను పిచ్చివాళ్లను చేస్తారు? ఎప్పుడు పరిపాలన చేస్తారు?’’ అని ప్రకాష్ రాజ్ తన ట్విట్లో కడిగి పారేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: