టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ఆయన వివివినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి అంతా సిద్దం చేసుకున్నారు.  ఈ సినిమాకు మొదట తేజ దర్శకత్వం వహిస్తున్నారనుకున్నా..ఆయన తప్పుకున్నారు.  ఆ తర్వాత రాఘవేంద్రరావు, పూరి జగన్నాధ్ ఇలా కొంత మందిని లైన్ లోకి తీసుకున్నారు..తన వందవ సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి గొప్ప చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ నే ‘ఎన్టీఆర్ బయోపిక్’ కి దర్శకుడిగా నిర్ణయించారు. 
Image result for hindu puram balakrishna
తర్వలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు.  ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన మార్క్ చూపిస్తున్నారు బాలకృష్ణ.  హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయంగా చురుకుగా పాల్గొంటున్నారు.  తాజాగా చిలమత్తూరు మండల టీడీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. హిందూపురంలో చిలమత్తూరు మండలం నేతలతో పంచాయతీల వారీగా ఆయన సమీక్షలు జరిపారు. 

ఈ సందర్భంగా గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి నేతలు బాలయ్యకు వివరించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఓ లెక్క ఇక నుంచి ఓ లెక్క..అంటూ..ఇకపై అందరూ కలసి పనిచేయాలని సూచించారు. లేకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేయాలని... లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: