ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  కొంత మంది డ్రైవర్ల నిర్లక్ష్యం..మద్యం సేవించి వాహనాలు నడపడం..అనుకోని విపత్తు వల్ల ప్రమాదాలు సంబవించడం ఇలా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ తీవ్రం అవుతూనే ఉంది. తాజాగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

గణపురం నుంచి భూపాల పల్లికి వెళ్తుండగా స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మధుసూదనాచారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు.  కాగా, దేవాదుల ప్రాజెక్టు పనుల నిమిత్తం పైపులను తీసుకు వెళ్తున్న లారీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టడంతో  ఆ వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈరోజు ఉదయం స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం, రైతులతో కలిసి నాగలి పట్టిన ఆయన దుక్కిదున్నారు. ఈ పర్యటన ముగించుకుని ఈరోజు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: