తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఏపీ బీజేపీ నేతలు డైరెక్ట్ అటాక్ కు దిగారు. ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రధాని మోడీ పై తీవ్రంగా వరుసగా లేనిపోని ఆరోపణలు చేస్తూ దూషించడంతో విజయవాడలో బీజేపీ నేతలు ఆందోళనలు నిరసనలు చేపట్టారు. విజయవాడ ధర్నాచౌక్లో జరిగిన ఈ నిరసనలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎంపీ గోకరాజు గంగరాజు అలాగే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఇంకా బిజెపి పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Image result for chandrababu

ఈ సందర్భంగా బిజెపి పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై అలాగే బీజేపీ నేతలపై అక్రమంగా భనాయిస్తున్న కేసులపై గట్టిగా విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పాలన చేయడం లేదని కేవలం అవినీతి చేస్తుందని పేర్కొన్నారు బిజెపి నేతలు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పురందేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో రాణించడానికి కేంద్రంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Image result for chandrababu

సరైన ఎడ్మినిస్ట్రేషన్ చేయాలేక ఎన్డీయే నుంచి బయటకు వచ్చి తన తప్పులను కేంద్రంపై రుద్దుతున్నారు అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. బీజేపీని ఏపీ ద్రోహిగా చూపే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు ఏపీకి చేసింది మాత్రం ఏమీ లేదన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ అవినీతిపై సీబీఐ విచారణ కోరేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా? అని పురందేశ్వరి సూటిగా ప్రశ్నించారు.

Image result for chandrababu

ముఖ్యంగా ఇటీవల పోలవరం విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లు అన్నీ అబద్ధాలే అంటూ పేర్కొన్నారు పురందేశ్వరి. 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. నిజంగా చంద్రబాబుకి తన పాలన పై చిత్తశుద్ధి ఉంటే మొదటి నుండి ఇప్పటిదాకా జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయించాలని సవాలు విసిరారు. మరి ఈ సవాలు చంద్రబాబు స్వీకరిస్తాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: