ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పార్టీల హవా మొదలవుతోంది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తాను పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలనే ప్రచారపర్వానికి ఉపయోగించుకుంటూ తన అభివృద్ధి పనులే విజయమంత్రంగా భావిస్తూ జనాలకు దగ్గరవుతున్నాడు. ఇక ప్రతిపక్ష నేత జగన్ మాత్రం పాదయాత్ర కొనసాగిస్తూ విభిన్న వర్గాల నుండి ప్రశంసలను అందుకుంటున్నాడు. 


కాగా ఈ ప్రశంసల పర్వం సినీ ఇండస్ట్రీ నుండే ఎక్కువరావడం గమనార్హం. ఈ మధ్యనే ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులయిన పృథ్వి రాజ్, పోసాని కృష్ణమురళి జగన్ యాత్రలో పాల్గొని హడావిడి చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు జస్ట్ ట్రైలర్ మాత్రమే అలాంటి సినిమా తారల మద్దతు  మా వద్ద చాలా ఉంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలపడం మిగితా పార్టీలకు భయాన్ని రేకెత్తిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలను చూసుకొనే వైఎస్సార్ కుటుంబం అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అంతకుముందు ఆ సినీతారలు జగన్ పై తమ అభిప్రాయాన్ని తెలిపిన వాక్యాలను అన్నీ  ఒక ఫోటోలాగా తయారు చేసి పోస్టు చేయడం జరిగింది.


ఈ ఫోటోలో హీరో విశాల్, సూపర్ స్టార్ కృష్ణ, సూర్య, యువహీరో నిఖిల్ లతో పాటు  క్యారెక్టర్ ఆర్టిస్టులయిన పోసాని, పృథ్వి మరియు కెమెరామన్ ఛోటా కే నాయుడు కూడా ఉన్నారు.  వీరిలో విశాల్, నిఖిల్ జగన్ పాదయాత్రను మెచ్చుకొని, ప్రశంసిస్తే సీ కే నాయుడు, జగన్ మగాడంటూ కితాబునిచ్చాడు. సూపర్ స్టార్ కృష్ణ అయితే ఏకంగా జగన్ సీఎం అవుతాడంటూ జోస్యం చెప్పాడు. వెళ్ళే కాకుండా మంచు విష్ణు సైతం జగన్ పాదయాత్రపై ప్రశంసలు గుప్పించగా ఆయన తండ్రి మోహన్ బాబు వైసీపీలో చేరబోతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మధ్య జగన్ సీఎం అవుతాడని నటుడు కృష్ణం రాజు వాఖ్యానించడం ఆయన బీజేపీని వదలి వైసీపీ తీర్థం పుచ్చుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. జగన్ కు అనుకూలంగా మాట్లాడిన వీరందరితో వచ్చే ఎన్నికల్లో ప్రచార నిమిత్తం వైసీపీ నాయకులు వీరిని సంప్రదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: