తెలుగు సినిమా రంగా ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏకిపారేశారు. తాజాగా పోసాని కృష్ణమురళి నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రాన్ని ప్రజలను మోసం చేశారు కళ్ళకి కట్టినట్లుగా చూపించి మరి చంద్రబాబు పరువును అడ్డంగా తిసేసారు. చంద్ర‌బాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచార‌ని అందుకే ఆయ‌న సీఎం అయ్యార‌ని అన్నారు.. 23 మంది ఎమ్మెల్యేల‌ను సిగ్గులేకుండా కొనుగోలు చేశార‌ని ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌దా అని మండిప‌డ్డారు ఆయ‌న‌. ఓటుకునోటు కేసులో దొరికిన చంద్ర‌బాబు సైలెంట్ గా పారిపోయి ఇటు విజ‌య‌వాడ వ‌చ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Image may contain: 5 people, people smiling

పోసాని విమ‌ర్శ‌ల‌తో ఒక్కసారిగా క‌ల‌క‌లం రేగింది.వైఎస్సార్‌ సీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అని నారా లోకేశ్‌ అంటున్నారని, చంద్రబాబు బీజేపీతో దోస్తి కట్టలేదా? అని నిలదీశారు. అంతేకాకుండా చంద్రబాబు అవసరం ఉంటే ఎవరి కాలు అయినా పట్టుకుంటారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని స్టేలు చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Image may contain: 3 people

ఎవరినైనా వాడుకోవాలంటే చంద్రబాబు తర్వాతేన్నేన్ని పవన్ కళ్యాణ్ ని అతని కులాన్ని వాడిన విధానాన్ని ఎండగట్టారు పోసాని. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ కి మంచి వేయడానికి చాలా రకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని షాకింగ్ కామెంట్ చేశాడు పోసాని. గత సార్వత్రిక ఎన్నికలలో జ‌గ‌న్ కు నేను ఓ స‌ల‌హా ఇచ్చా…రైతుల‌కు రుణ‌మాఫీ చేయాల‌ని చెప్పా కాని  రైతుల‌కు మ‌రింత మంచి ప‌థ‌కం పెట్టాము అని, వారికి మోసం చేయ‌మ‌ని చెప్పారు.

Image may contain: 8 people, people smiling, people standing and outdoor

అంతేకాకుండా నేను చెప్పిందే చేస్తాను అంటూ ఖరాకండిగా జగన్ ఆరోజు నాకు తెలియజేశారు అని పోసాని అన్నాడు...తాజాగా ఇటీవల జగన్ ని కలిసినప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయమే మంచిది నాన్న వచ్చే ఎన్నికలలో కూడా చెప్పిందే చేయి చేసేదే చెప్పు అంటూ సలహా ఇచ్చానని అన్నారు పోసాని. జగన్ సీనియర్ నాయకుడు కాదు...కానీ సిన్సియర్ నాయకుడు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు...ప్రస్తుతం రాష్ట్రానికి సీనియారిటీ కాదు సిన్సియర్ క్రెడిబులిటీ ఉన్న నాయకుడు అవసరం ఈ లక్షణాలు అన్నీ జగన్ లో ఉన్నాయని పేర్కొన్నాడు రైటర్ పోసాని కృష్ణమురళి.



మరింత సమాచారం తెలుసుకోండి: