ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’మొదలుపెట్టినప్పటి నుంచి అశేష ప్రజాదరణ వస్తుంది.  ఎక్కడికి వెళ్లినా రాజన్న మళ్లీ తిరిగి వచ్చారా అంటూ ప్రజలు వైఎస్ జగన్ ని గుండెలకు హత్తుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన నడుస్తుందని..ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి గట్టిగా అడిగిన ప్రతిపక్ష నేతలపై తన అధికారం చూపిస్తున్నారని ఇప్పటికైనా ప్రజల టీడీపీ కుతంత్రాలను గమనించాలని ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. 

ఈరోజు రాజమహేంద్రవరం, కోటిపల్లి శ్యామలా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... 'చందబ్రాబు నాయుడు మొదటి సినిమాను చూపిస్తూ... అదిగో సింగపూర్‌.. అదిగో జపాన్‌.. ఇదిగో రాజధాని అమరావతి అంటారు' అని ఎద్దేవా చేశారు. ఏపి ప్రజలకు చంద్రబాబు నాయుడు ఒకే సారి రెండు సినిమాలు చూపిస్తున్నారని..ఒకటి అమరావతి రెండోది పోలవరం అని అన్నారు. కాస్త కలెక్షన్లు ఎక్కువ రావడానికి ప్రతి సోమవారం పోలవారం అంటూ అక్కడకు వెళుతున్నారని ఆరోపించారు.

"పోలవరం సినిమా ఎలా ఉందంటే మొన్న పునాది గోడలను జాతికి అంకితం చేశారు. డయాఫ్రమ్ వాల్ అంటూ ఎన్నో అసత్యాలు చెప్పుకున్నారు. ఒక ఇల్లు కట్టడానికి ఆరుసార్లు శంకుస్థాపన చేసినట్లు ఉందని విమర్శించారు. అప్పట్లోనూ చంద్రబాబు 9 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు కోసం ఏమీ చేయలేదు. నాటి 9 ఏళ్ల చంద్రబాబు హయాంలో టీడీపీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు 3000 కిలోమీటర్లు సైకిల్ పై యాత్ర చేశారు.

పోలవరం నిర్మించాలని ఆయన చంద్రబాబును అనేకసార్లు అడిగినా పట్టించుకోలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవిలోకి రాగానే ‘పోలవరం’ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని అన్నారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నత్తనడకన ముందుకు వెళుతోంది. పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్ధితో లేరు" అని జగన్‌ అన్నారు.        


మరింత సమాచారం తెలుసుకోండి: