భారత దేశంలో రోజు రోజుకీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు..మహిళలు కనిపిస్తే చాలు చిత్తకార్తె కుక్కల్లా రెచ్చిపోతున్నారు. చిన్నాపెద్దా అనే తారతమ్యం లేకుండా కామంధులు దారుణాలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తిని చితకబాది.. చెట్టుకు కట్టేసి... అతని కళ్లేదుటే భార్య, కూతుళ్లను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశారు. బిహార్లో జరిగిన ఈ సంఘటన యావత్ భారత దేశంలో మరో సంచలనం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. గురౌరు బజార్లో క్లినిక్ నిర్వహిస్తున్న వైద్యుడు.. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో క్లినిక్ మూసేసి, భార్య, కూతురితో తన వాహనంపై బయలు దేరారు.
నిర్మాణుషమైన ప్రదేశం రాగానా ఒక్కసారిగా కొంత మంది యువకులు వారిని అడ్డుకున్నారు. తల్లీ, కూతురు పట్ల అసహ్యంగా ప్రవర్తించసాగారు..దాంతో వైద్యుడు వారిపై తిరగబడటంతో అతనిని దారుణంగా కొట్టి చెట్టుకు కట్టేసి తుపాకీ గురి పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరూ ఆ తల్లీ కూతురిపై దారుణంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో అక్కడకి కొంత మంది గ్రామస్తులు రావడంతో పారిపోయారు. పరిస్థితి గమనించిన గ్రామస్థులు ఆ వైద్యుడిని తల్లీ కూతురుని రక్షించారు.
గ్రామస్థుల సాయంతో బాధితులు.. కొంచ్ పోలీస్ స్టేషన్కు చేరి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే..ఆ నేరస్తులను ఒక్క గంటలోనే పోలీసులు పట్టుకున్నారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ ఐజీ నయ్యర్ హసనైన్ ఖాన్ స్వయంగా కేసును పర్యవేక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారిని సస్పెండ్ చేశారు.
అర్ధరాత్రే 11 మందిని.. మిగిలిన వారిని ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నింధితులను పట్టుకునే విషయంలో సోనిదిహ్ గ్రామస్థులు సైతం పోలీసులకు సాయపడటం విశేషం. అరెస్టయిన నింధితులు స్థానికంగా వెళ్తున్న కొందరు మహిళలను కూడా వేధించారని, ఇద్దరు యువకుల దగ్గర ఫోన్లు, డబ్బు లాక్కున్నట్లు తేలింది.