టీడీపీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు చంద్ర బాబు మీద ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పడూ తాజాగా మళ్ళీ చంద్ర బాబు మీద విరుచుకు పడినాడు. చంద్ర బాబు ను ఎవరు నమ్మవద్దని ప్రజలే చంద్ర బాబుకు గుణ పాఠం చెప్పాలని. పవన్ కళ్యాణ్ ను వాడుకొని వదిలేశాడని ఇంతక ముందు జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని పక్కన పెట్టేశాడని నిప్పులు చెరిగినాడు. 

Image result for mothkupalli narsimhulu

చంద్రబాబు తన సంపాదన అంతటినీ విదేశాల్లో దాస్తున్నారని ఆరోపించారు. దుబాయ్, సింగపూర్, అమెరికాలో దాస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని, ఒకవేళ దొరికినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చునని, దమ్మూధైర్యం ఉంటే ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకోవాలన్నారు. చంద్రబాబు విచారణకు ముందుకు రావాలన్నారు. సీబీఐ విచారణ జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకు వస్తుందన్నారు. 

Image result for mothkupalli narsimhulu

చంద్రబాబు చేసే రాజకీయ వ్యాపారాన్ని ఓ దళితుడిగా ఖండిస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు, నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి కావాల్సిన బాలకృష్ణను చంద్రబాబు మోసం చేశారన్నారు. నందమూరి కుటుంబంలో ఎవరికి నువ్వు న్యాయం చేశావో చెప్పాలన్నారు. వాళ్లందరూ నీ ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. నీ కొడుకు, ఆ తర్వాత మనవడికి రాజ్యాధికారం కావాలని కోరుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: